రణక్షేత్రాన రైతులకు శాశ్వత నివాసాలు

by  |
Kisan Social Army
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఇప్పట్లో వారి పోరును ఆపేలా కనిపించడం లేదు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేదాకా ఎన్నాళ్లైనా పోరాడతామని అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో శాశ్వత నివాసాలను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ బార్డర్ వద్ద ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. రైతుల కోసం కిసాన్ సోషల్ ఆర్మీ (కేఎస్ఏ) ఈ చర్యకు పూనుకున్నది. ఇప్పటికే అక్కడ 25 ఇళ్లను నిర్మించినట్టు నాయకుడు కేఎస్ఏ అధ్యక్షుడు అనిల్ మాలిక్ తెలిపారు. రాబోయే రోజుల్లో వేయి నుంచి 2 వేల దాకా ఇళ్లను నిర్మిస్తామనీ తెలిపారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.25 వేల దాకా ఖర్చవుతుందని చెప్పారు. సిమెంటు, ఇటుకలతో ఈ ఇళ్లను నిర్మిస్తున్నామనీ, రైతుల మనోధైర్యంలానే ఇవి కూడా ఎక్కువకాలం మనగలుగుతాయని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్ 26 నుంచి దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed