కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

by  |
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
X

దిశ, వరంగల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. ఆమె సోమవారం ములుగు మండలం జగ్గన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాలు నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.

Tags: mla sithakka, pady purchasing centre, mulugu, ts news

Next Story

Most Viewed