ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలు

by  |
ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 71వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘా, టిక్రి, ఘాజీపూర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల నేపథ్యంలో సమీప రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దుకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. కొత్త సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెల 6వ తేదీన జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్బంధనం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed