ధాన్యం కొంటారా పురుగుల మందు తాగమంటారా?

by  |
ధాన్యం కొంటారా పురుగుల మందు తాగమంటారా?
X

దిశ, కరీంనగర్: ఊరూర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు పడే అవకాశం ఉండటం మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామానికి చెందిన రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరనస తెలిపారు. ధాన్యం ఎండ బెట్టినా ఇంతవరకు కొనుగోలు చేపట్టలేదంటూ ఆరోపించారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ఇందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: Karimnagar, farmers, crop purchase center



Next Story

Most Viewed