సిరిసిల్లలో అన్నంత పని చేసిన రైతులు..

by  |
సిరిసిల్లలో అన్నంత పని చేసిన రైతులు..
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రహదారిపై ధాన్యానికి నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి తూకం కోసం ఎదురు చూస్తున్నామని మండిపడ్డారు.

అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందన్నారు. కొనుగోలు కేంద్రంలో ఆరు బయట ధాన్యాన్ని నిల్వ చేస్తే ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం తడిసిపోయి నష్ట పోయామని వాపోయారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు పండించిన వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్లే ఈ విధంగా ధాన్యానికి నిప్పు పెట్టి ధర్నా నిర్వహించామన్నారు.



Next Story