నీలాలో రైతుల రాస్తారోకో.. ప్రభుత్వానికి హెచ్చరిక

by  |
Neela-1
X

దిశ, బోధన్: రైతులు పండించిన పంటలను అకారణంగా రైస్ మిల్లర్లు వెనక్కి పంపిస్తున్నారని నీలా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నీలా గ్రామంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, వెనక్కి పంపిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండలంలోని అన్ని గ్రామాల రైతులతో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రైతులతోపాటు మునిర్ ఖాన్, శ్రీకాంత్, అబ్బోల్ల, లవోల్ల గంగాధర్, నశీర్, వీరేశ్, శ్యామ్, రాజు పాల్గొన్నారు.



Next Story