కేంద్రంపై ఆగ్రహం… కర్నాటక బంద్

by  |
కేంద్రంపై ఆగ్రహం… కర్నాటక బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి, ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో భాగంగా రోడ్లపైకి వచ్చిన బస్సులను అడ్డుకుంటున్నారు. ఈ చట్టాలతో రైతులకు నష్టం వాటిల్లుతుందని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అంతేగాకుండా వ్యవసాయ సంబంధ దుకాణాదారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. అటు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పంజాబ్ యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో నిరసనకారులు ఓ ట్రాక్టర్‌ను తగులబెట్టారు.


Next Story

Most Viewed