సిరిసిల్లలో రైతన్న ఆగ్రహం.. ధాన్యానికి నిప్పు

by  |
సిరిసిల్లలో రైతన్న ఆగ్రహం.. ధాన్యానికి నిప్పు
X

దిశ, కరీంనగర్: వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల కండిషన్లపై ఆగ్రహించిన అన్నదాతలు ధాన్యం కుప్పలపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని స్థానిక మిల్లులకు తరలించారు. తాలు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోలు తరుగు తీసి కొనుగోలు చేస్తామని మిల్లర్లు కండిషన్లు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ పని చేయవని రైతులతో చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన రైతన్న తమ ధాన్యానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టుకున్నారు. మిల్లర్ల దగాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags: Karimnagar, farmers, protest, Millers, conditions, fire

Next Story

Most Viewed