- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల పై ఉత్తర భారతదేశంలో ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ధర్నాలు హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో యుద్ధవాతవరణానికి తెరలేపాయి. నేడు చలో ఢిల్లీకి రైతులు పిలుపునిచ్చారు. దీంతో హర్యానా సరిహద్దు నుంచి ర్యాలీగా బయల్దేరిన సమయంలో భద్రతా బలగాలు రైతులను అడ్డుకున్నాయి. రైతులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో సింఘ దగ్గర పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఇప్పటికే గత రెండ్రోజులుగా పంజాబ్, హర్యానా సరిహద్దులు మూసివేయడంతో.. రైతులు అక్కడే బైఠాయించారు. ఈ పరిణామాల మధ్య అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Next Story