పంట మార్పిడితోనే లాభాలు : కలెక్టర్

by  |
పంట మార్పిడితోనే లాభాలు : కలెక్టర్
X

దిశ‌, ఖ‌మ్మం : మార్కెట్లో ధ‌ర ఉన్న పంట‌ల‌నే రైతులు సాగు చేయాల‌ని ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ పిలుపునిచ్చారు. ఖ‌మ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో వ్య‌వ‌సాయ‌శాఖ ఆధ‌ర్వంలో నియంత్ర‌ణ సాగు విధానంపై రైతులకు అవగాహన క‌ల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంట మార్పిడితోనే దిగుబ‌డులు పెరిగి లాభాలు వ‌స్తాయ‌న్న విష‌యం గ్ర‌హించాల‌న్నారు. రైతుల్లో చైత‌న్యం తీసుకురావాల్సిన బాధ్య‌త వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారుల‌తో పాటు రైతుబంధు కోఆర్డినేట‌ర్ల‌పై కూడా ఉంద‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed