బ్రేకింగ్.. తూకంలో మోసం.. కొనుగోలు కేంద్రంపై అన్నదాతల దాడి (వీడియో)

by  |
బ్రేకింగ్.. తూకంలో మోసం.. కొనుగోలు కేంద్రంపై అన్నదాతల దాడి (వీడియో)
X

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒబులాపూర్ రైతులు.. ధాన్యం కొనుగోలు కేంద్రంపై దాడి చేశారు. ధాన్యం తూకంలో తమను నిట్ట నిలువునా ముంచుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 కిలోలకు ఆరు కిలోల చొప్పున ఎక్కువ తూకం వేసుకుంటున్నారంటూ రైతాంగం ఆరోపిస్తొంది. త్రాసుల్లోనే గోల్ మాల్ చేస్తూ ఎక్కువ తూకం వేసుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఇప్పటి వరకూ 20 లారీల ధాన్యం సేకరించారని తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల ఆందోళనతో అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని విచారించగా వాస్తవమేనని తేలింది. ఏపీఎం స్థానికంగా ఉండటం లేదని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుటామని అధికారులు చెప్తున్నారు. దీంతో తమకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. అధికారులు రైతులను సముదాయిస్తున్నా వారు ససేమిరా అంటున్నారు.


Next Story

Most Viewed