పంట అమ్మినా.. డబ్బులు ఇవ్వలేదని

by  |
పంట అమ్మినా.. డబ్బులు ఇవ్వలేదని
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సింగిల్ విండో బ్యాంకు ముందు రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రైతు బద్దం సత్తిరెడ్డి నాలుగు నెలల కిందట తన కందిపంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. అయితే ఇంకా రూ. లక్ష కు పైగా నగదు రావాల్సి ఉందని, అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పకపోవటంతో రైతు పురుగుల మందు డబ్బాతో బ్యాంకు ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి రైతును కాపాడారు.


Next Story

Most Viewed