పరిహారం ఇవ్వలేదు.. ప్రాజెక్టు వద్ద రైతు సూసైడ్ అటెంప్ట్

by  |
పరిహారం ఇవ్వలేదు.. ప్రాజెక్టు వద్ద రైతు సూసైడ్ అటెంప్ట్
X

దిశ, భువనగిరి: రిజర్వాయర్ నిర్మాణంలో భూమిని కోల్పోయిన రైతు.. పరిహారం చెల్లించలేదని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‌లో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన రైతు సతీష్ బస్వాపూర్ ప్రాజెక్టులో భాగంగా తన వ్యవసాయ భూమిని కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, పరిహారం ఇవ్వకుండానే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడని.. ప్రాజెక్టు వద్దకు వెళ్లిన సతీష్ తన ఆటోకు నిప్పంటించి.. తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో ఆటో పూర్తిగా కాలిపోగా.. మంటల్లో తగలబడుతున్న సతీష్‌ను స్థానికులు రక్షించారు. మంటలను చల్లార్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Next Story

Most Viewed