- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చండ్రుగొండ/అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చండ్రుగొండ మండలం బాల్య తండాకు చెందిన భూక్య రాధాకృష్ణ తన పొలంలో విద్యుత్ కనెక్షన్లు తొలగించారని, తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరితే ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తహశీల్దార్ కార్యాలయంలోనికి వచ్చి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
అదే సమయంలో అతని తమ్ముడు భూక్య జయకృష్ణ కూడా ఉన్నాడు. ఎవరికీ ఏమీ జరగకపోవడంతో తహశీల్దార్ శారదతో పాటు కార్యాలయ సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని బాధిత రైతుకు సర్దిచెప్పి న్యాయం చేస్తామని పంపించివేశారు.
Next Story