ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ పోసుకున్న రైతు.. నిప్పంటించుకునేలోపు..!

by  |
ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ పోసుకున్న రైతు.. నిప్పంటించుకునేలోపు..!
X

దిశ, చండ్రుగొండ/అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చండ్రుగొండ మండలం బాల్య తండాకు చెందిన భూక్య రాధాకృష్ణ తన పొలంలో విద్యుత్ కనెక్షన్లు తొలగించారని, తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరితే ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తహశీల్దార్ కార్యాలయంలోనికి వచ్చి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

అదే సమయంలో అతని తమ్ముడు భూక్య జయకృష్ణ కూడా ఉన్నాడు. ఎవరికీ ఏమీ జరగకపోవడంతో తహశీల్దార్ శారదతో పాటు కార్యాలయ సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని బాధిత రైతుకు సర్దిచెప్పి న్యాయం చేస్తామని పంపించివేశారు.

Next Story

Most Viewed