- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,కోదాడ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎర్రమాది విశ్వనాథం (58) తన పొలాన్ని చూసేందుకు వెళ్తున్న క్రమంలో దారిలో 11కేవీ హైటెన్షన్ వైరు తెగి కింద పడి ఉంది. అది గమనించని విశ్వనాథం విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదు.
Next Story