అది దొరకడంతో రైతు పంట పండింది

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-05-22 08:24:57  IST  )

<p>దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఓ రైతు పంట పండింది. తన పొలాన్ని గుంటకతో దున్నుతుండగా ఓ మెరుపు మెరిసింది. తీరా అది ఏందని చూడగా వజ్రం అని తెలియడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ రైతు వజ్రాన్ని మిత్రుల సహాయంతో కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే బేరం బెడిసికొట్టడంతో దానిని గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి 30 [&hellip;]</p>

అది దొరకడంతో రైతు పంట పండింది
X

దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఓ రైతు పంట పండింది. తన పొలాన్ని గుంటకతో దున్నుతుండగా ఓ మెరుపు మెరిసింది. తీరా అది ఏందని చూడగా వజ్రం అని తెలియడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ రైతు వజ్రాన్ని మిత్రుల సహాయంతో కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే బేరం బెడిసికొట్టడంతో దానిని గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి 30 లక్షల రూపాయలకు విక్రయించారు. వ్యాపారితో మధ్యవర్తులు కుమ్మకై రైతును మోసం చేశారన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.

Next Story