కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

by  |
కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, కొత్తగూడెం: జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గొల్లపూడి శ్రీనివాస్ కొత్తగూడెం కలెక్టరేట్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

తల్లిదండ్రుల వారసత్వంగా అన్నదమ్ములకు వచ్చిన తన నాలుగు ఎకరాల భూమిని తన అన్నయ్య గొల్లపూడి శ్యామ్ సుందర్ అక్రమంగా గుంజుకున్నాడని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళితే జూలూరుపాడు పోలీసులు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా భూమి జోలికి వెళ్లొద్దు అని ఒకవేళ వెళితే ఊరుకునేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. పలుమార్లు కలెక్టర్‌కి వినతి పత్రం అందించి నెలలు గడుస్తున్నా, ఎటువంటి న్యాయం జరగలేదని బాధితుడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అతనికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి బాధితుడు శ్రీనివాసును ఆస్పత్రికి తరలించారు.

Next Story