రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ.. కుప్పంలో జెండా ఆవిష్కరణ

by  |
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ.. కుప్పంలో జెండా ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR.NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం RRR సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత త్రివిక్రమ్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజకీయాల గురించి పట్టించుకోకుండా సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో ఎన్టీఆర్ తిరిగి రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి బాగా వినిపిస్తున్నాయి.

కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినూత్నంగా తమ డిమాండ్ వినిపించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తిరిగి రావాలని కోరుతూ ఎన్టీఆర్ ఫొటోతో ఒక జెండా తయారుచేసి ఎగురవేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఎన్నికల సమయంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి టీడీపీలోకి తీసుకురావాలంటూ స్వయంగా చంద్రబాబు ముందే ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మరోసారి ఫ్యాన్స్ ఇలా వినూత్నంగా తమ డిమాండ్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed