గుడ్‌న్యూస్ చెప్పిన కాజల్.. కుటుంబంలో ఒకరు చేరుతున్నారంటూ పోస్ట్

by  |
గుడ్‌న్యూస్ చెప్పిన కాజల్.. కుటుంబంలో ఒకరు చేరుతున్నారంటూ పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతకొన్ని రోజుల క్రితం త్వరలో ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉందంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే, ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఆ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దీనిని కాజల్ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే, ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అనగానే చాలా మంది అభిమానులు కాజల్ తల్లి కాబోతోందని, త్వరలోనే అందరికీ ప్రకటిస్తుందని ముందుగా భావించారు. దీనిపై వార్తలు కూడా చాలా వచ్చాయి.

చాలా మంది కాజల్‌కి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. కానీ, అభిమానులందిరినీ అవాక్కైయ్యేలా చేసింది అందాల చందమామ. ఆమె ఇన్స్‌స్టాలో చేసిన పోస్ట్ ప్రకారం ''తన కుటుంబంలోకి మరో వ్యక్తిని పరిచయం చేస్తూ స్వాగతం. దీని పేరు మియా, నాకు చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టం, ఈ సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానంటూ ఫొటోని షేర్ చేసింది'. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Next Story

Most Viewed