లంచం ఇవ్వలేదని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

by  |
లంచం ఇవ్వలేదని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. తమ ఇంటిని అక్రమంగా కూల్చారని నిరసిస్తూ ఓ కుటుంబం మున్సిపల్ ఆఫీసు ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు రెవెన్యూ సిబ్బంది తమను లంచం డిమాండ్ చేశారని, దానికి నిరాకరించడంతో కావాలనే ఇంటిని కూల్చారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.


Next Story