దారుణం : కుటుంబాన్ని గొడ్డళ్లతో నరికి చంపారు

by  |
murder-wgl 1
X

దిశప్రతినిధి, కరీంనగర్ : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, ఇద్దరు కొడుకులను గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. గంగారంలోని పత్తి చేను వద్ద జరిగిన గొడవ కాస్తా ముగ్గురి హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తోంది. భూ తగాదాలే ఈ హత్యలకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. హత్యకు గురైన వారిలో తండ్రి లావుడ్యా మంజూ నాయక్, కొడుకులు సారయ్య, భాస్కర్‌లు ఉన్నారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed