- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఒకే కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఆతహత్యకు పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ ప్రాంతంలో ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. సామూహిక ఆత్మహత్యల విషయం స్థానికంగా కలకలం రేపింది. అయితే, కుటుంబసభ్యుల మరణం మాత్రం చుట్టుపక్కల వారికి విచిత్రంగా అనిపించింది. తండ్రీ, కొడుకు ఒకే తాడుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా.. తల్లి, ఇద్దరు కూతుర్లు మాత్రం ఒంటికి నిప్పటించుకున్నట్లు సమాచారం. సగం కాలిన గాయాలతో వారు మృతి చెందారు. అంతేకాకుండా, ఇద్దరు ఇంట్లో చనిపోతే, ముగ్గురు ఇంటి పరిసరాల్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
వీరంతా ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక కుటుంబ పెద్ద ఉరేసుకున్న అనంతరం మిగిలిన కుటుంబ సభ్యులు నిప్పంటించుకున్నారా..? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. కాగా, ఇది ముమ్మాటికీ సామూహిక ఆత్మహత్యలే అని పోలీసులు తేల్చారు. అందుకు సంబంధించి మృతుల ఇంట్లో నోట్ లభించిందని వెల్లడించారు. కానీ, అందులో ఏముందో బయటకు వెల్లడించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.