- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడిని కడసారి చూసేందుకు వెళ్లివస్తూ వీరంతా రోడ్డు ప్రమదంలో మృత్యువాత పడడం కలచివేస్తోంది. చిత్తూరు జిల్లాలోని కలకడ మండలం బాటవారిపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేశ్బాబు (19) తండ్రితో కలిసి పీలేరులో ఉంటున్నాడు. నిన్న అతడి తల్లి సంవత్సరీకం కావడంతో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బైక్పై సొంతూరు బయలుదేరాడు. కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తుండగా కలకడ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడి మృతి చెందాడు.
విషయం తెలిసి తిరుపతిలో ఉంటున్న యువకుడి తాతయ్య (అమ్మ తండ్రి) వెంకటరమణ (60), అమ్మమ్మ పార్వతమ్మ (55), వరుసకు అమ్మమ్మ అయ్యే సుజనమ్మ (45), చిన్నమ్మ రెడ్డి గోవర్ధిని (25), బంధువులు దామోదర (35), లీలావతి, పుష్పకుమారి నిన్న సాయంత్రం ఆటోలో పీలేరుకు చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని చూసిన అనంతరం తిరిగి రాత్రి అదే ఆటోలో కొత్తగాండ్లపల్లెకు బయలుదేరారు. ఈ క్రమంలో సొరకాయలపేట చెరువు కట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ, పార్వతమ్మ, సుజనమ్మ, రెడ్డి గోవర్ధిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి బంధువు దామోదర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్రంగా గాయపడిన పుష్పకుమారి, లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.