కరోనా సోకిందనే భయంతో కుటుంబం ఏం చేసిందంటే?

by  |
కరోనా సోకిందనే భయంతో కుటుంబం ఏం చేసిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సోకిందనే భయంతో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిందనే భయంతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో వెలుగు చూసింది. కరోనా‌కు భయపడి ఓకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు కూతురు కూడా బలవన్మరణానికి పాల్పడటంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి గత వారం రోజులక్రితం జ్వరం వచ్చింది… వారం రోజులుగా జ్వరం తగ్గక పోవడం అలానే జ్వరంతో పాటు కరోనా లక్షణాలు కూడా ఉండటంతో కరోనా అని భయపడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తన్నారు.


Next Story

Most Viewed