- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు నకిలీ వ్యక్తుల ముఠా బెడద ఎక్కువ అయ్యింది. తాము ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేస్తున్నామని చెప్పుకుని, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. మొన్న టీఆర్ఎస్ నేత కేకేకు మహేశ్ అనే వ్యక్తి కాల్ చేసి.. తాను మంత్రి కేటీఆర్ దగ్గర పనిచేస్తున్నాని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ విషయాన్ని కేశవరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అదంతా అబద్ధం అని తేలింది. తాజాగా ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో మరో వ్యక్తికి ఈ ముఠా కాల్ చేసి టోకరా వేసింది. సోషల్ మీడియాలో ఎంపీ సంతోష్ పేరిట ఓ యువకుడు నకిలీ ఖాతా క్రియేట్ చేశాడు. మెసేంజర్ నుంచి కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మాదాపుర్ పీఎస్లో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story