ములుగు జిల్లాలో పులుల సంచారం.. అంతా ఫేక్

by  |
tiger-camera-traps
X

దిశ, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దు ప్రాంతంలో గల ఎదిరగుట్ట అటవీ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నాయి.. అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఉత్తదే అంటూ అటవీశాఖ అధికారులు నిర్ధారణ చేశారు. ఫేక్ వార్త వైరల్ కావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దిశ రిపోర్టర్ చర్ల రేంజ్ అధికారి ఉపేందర్‌కు ఫోన్‌లో వివరణ కోరగా.. పులుల ఆనవాళ్లు ఎదురగుట్ట అటవీ ప్రాంతంలో కాదని చెప్పారు. వైరల్ అవుతున్న వీడియో వేరే ప్రాంతానికి చెందినది అంటూ పుకార్లను కొట్టిపారేశారు. ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed