ఉద్యోగం పేరుతో వంచన.. యువతులే టార్గెట్!

by  |
ఉద్యోగం పేరుతో వంచన.. యువతులే టార్గెట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి యువతులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలకు చెందిన సంపత్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ జర్నలిస్టు అవతారమెత్తాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మీడియా సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలువురు యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేశాడు.

రోజులు గడుస్తుండటంతో ఇవాళ, రేపు అంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతుల ఫిర్యాదు మేరకు సంపత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.



Next Story

Most Viewed