మూడు రాష్ట్రాల్లో నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులు

by  |
vaccanation
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల్లో ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహించినట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. ‘అదనపు చర్యగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సరఫరాలో అప్రమత్తతను పెంచాలి. అంతేకాకుండా అటువంటి అసాంఘిక కార్యకలాపాల నుండి రక్షణ కల్పించడానికి టీకా ఉత్పత్తి భౌతిక పరిస్థితిని జాగ్రత్త పరచాల్సి ఉంది’ అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలు కోవిన్ పోర్టల్‌లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు. దీంతో పాటు డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నామని చెప్పారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story