దొంగబాబా నయా మోసం.. రాళ్లు కరిగిస్తానని బంగారం ఎత్తుకెళ్లాడు

by  |
దొంగబాబా నయా మోసం.. రాళ్లు కరిగిస్తానని బంగారం ఎత్తుకెళ్లాడు
X

దిశ, నిజామాబాద్ రూరల్ : కిడ్నీలో రాళ్లు కరిగిస్తానని రెండున్నర తులాల బంగారం అపహరించాడు ఓ దొంగ బాబా. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద అన్ని వ్యాధులను నయం చేస్తానంటూ దొంగ బాబా వచ్చాడు. ఈ వార్త విన్న గ్రామస్తులు ఆయా జబ్బుల పేరుతో అతడి వద్ద గుమిగూడారు. ఈ నేపథ్యంలోనే గత ఆరు నెలలుగా కిడ్నీల్లో రాళ్ల ఏర్పడ్డాయని జాజుల గోదావరి అనే మహిళ బాబా వద్దకు వచ్చింది. వ్యాధిని నయం చేయాలని వేడుకుంది. ఇదే అదునుగా చూసుకున్న అతడు ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం, చేతి ఉంగరాలను ఇంట్లో మూలన పాతిపెడితే కిడ్నీల్లో రాళ్లు పోతాయని నమ్మించాడు. ఈ క్రమంలోనే బాధితురాలు బంగారం తీసి ఇవ్వగానే మూలకు పెడుతున్నానని చెబుతూ.. వాటిని తీసుకొని అక్కడి నుంచి పరారీ అయ్యాడు. దీంతో మోస పోయానని తెలుసుకున్న గోదావరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ బాబా కోసం గాలింపు చేపట్టారు.

Next Story

Most Viewed