దయ్యం వదలాలని.. కూతురును ముస్తాబు చేసి పంపిన తల్లి.. ఆ తర్వాత..?

by  |
దయ్యం వదలాలని.. కూతురును ముస్తాబు చేసి పంపిన తల్లి.. ఆ తర్వాత..?
X

దిశ, వెబ్‌డెస్క్: మూఢనమ్మకాలు.. మనుషులను భయపెట్టేవి.. మనసులను కలవరపెట్టేవి.. ప్రపంచం కొత్తకొత్త టెక్నాలజీలతో రోజుకో రంగు పులుముకొంటున్నా.. ఇంకా కొన్నిచోట్ల మూఢనమ్మకాలకు కొంతమంది బలవుతూనే ఉన్నారు. దయ్యం పట్టిందని, బిడ్డలు పుట్టడం లేదని కొంతమంది దొంగ బాబాలను నమ్మి సర్వం సమర్పిస్తున్నారు. వారు అందినంత దోచుకోవడం, మహిళలను పూజల పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రాసలీలలు చేస్తున్నారు. ఇక వీటికి కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడం సిగ్గుపడాల్సిన విషయం. తాజాగా ఒక తల్లి.. ఎవరు చేయని ఒక పనిని ఈ మూఢనమ్మకం పేరుతో చేసింది. సాక్షాత్తూ కన్న తల్లే తన కుమార్తెపై అత్యాచారం చేయమని ఓ వ్యక్తిని అనుమతించింది. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. భివండీలోని గ్రామానికి చెందిన ఒక మహిళ తన 16 ఏళ్ల కుమార్తెతో నివసిస్తోంది. ఇటీవలే ఆమె అన్న అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుంచి కుమార్తెకు మెడ నొప్పి మొదలయ్యింది. దీంతో ఆమె బాలికను తీసుకొని స్వయం ప్రకటిత దేవుడు అని చెప్పుకొనే ఒక వ్యక్తి వద్దకు తీసుకెళ్లింది. అతడు బాలికను చూసి, ఆమెకు చనిపోయిన మామయ్య దయ్యమై పట్టాడని, బాలికకు పట్టిన దయ్యాన్ని వదిలించి అనారోగ్యాన్ని దూరం చేస్తానని, తాను చెప్పినట్లు చేయాలని తెలిపాడు. అర్ధరాత్రి బాలికను ముస్తాబు చేసి ఒంటరిగా అడవిలోకి పంపాలని, అక్కడ బాలికకు పూజలు చేసి దయ్యం వదిలిస్తానని చెప్పాడు. దీంతో తల్లి అదే విధంగా చేసింది. దయ్యాన్ని వదిలించి అనారోగ్యాన్ని దూరం చేస్తానని చెప్పి బాలికను అడవిలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారం చేసిన వ్యక్తితోపాటు దానికి సహకరించిన తల్లిని కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.


Next Story

Most Viewed