నకిలీ అధికారిని పట్టించిన 'గూగుల్ పే'

by  |
నకిలీ అధికారిని పట్టించిన గూగుల్ పే
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పిఏకి ఏసీబీ డీఎస్పీ నంటూ ఓ నకిలీ ఫోన్ చేశాడు. చిత్తూరులోని వీఐపీల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామంటూ చెప్పాడు ఆ మాయగాడు. తాను ఏసీబీ డిఎస్పీ హరికృష్ణనంటూ ఎమ్మెల్యే పిఏకి నమ్మబలికాడు. ఖర్చులకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. రూ.7000 గూగుల్ పే చేశాడు ఎమ్మెల్యే పిఏ. తరువాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గూగుల్ పే కోసం ఇచ్చిన నంబర్ ఆధారంగా నిందితుడిని గురువారం పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు సేకరించిన హరికృష్ణ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.



Next Story