జర్నలిజం రంగంలోకి ఫేస్‌బుక్.. కారణం కరోనా?

by  |
జర్నలిజం రంగంలోకి ఫేస్‌బుక్.. కారణం కరోనా?
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిజం రంగంలో వంద మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ లాంటి పాండమిక్ కారణంగా తప్పుడు సమాచారం, వార్తల కారణంగా భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన జర్నలిజం ద్వారా స్థానిక సమాచారాన్ని క్యూరేట్ చేయాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది.

ఫేస్‌బుక్ జర్నలిజం ప్రాజెక్టు ద్వారా స్థానిక వార్తల కోసం 25 మిలియన్ల డాలర్ల గ్రాంట్ ఇవ్వనుంది. అలాగే మిగతా 75 మిలియన్ల డాలర్ల గ్రాంటును ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ ఏజెన్సీ మార్కెటింగ్ లావాదేవీల కోసం అందించనుంది. అంతేకాకుండా కరోనా కాకుండా పబ్లిషర్స్ ఆదాయం దారుణంగా పడిపోయే పరిస్థితి ఉంది. ఫేస్‌బుక్ జర్నలిజం నిర్ణయం వల్ల ఈ పబ్లిషర్స్‌కి కూడా మేలు కలగనుంది. తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags : Facebook, corona, Covid, Journalism, Effect, fake news

Next Story

Most Viewed