- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జడ్చర్ల: పాలమూరు జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించే జంగ్ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యక్రమానికి బయలుదేరిన సమయంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి మీదుగా పట్టణంలోకి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రవేశించకుండా పోలీసులు ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేసి.. జాతీయ రహదారి మీదుగా ర్యాలీ వెళ్లాలని సూచించారు. కానీ, పట్టణం నుంచే ర్యాలీ నిర్వహిస్తామని కార్యకర్తలు పట్టుబడడంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో కార్యకర్తలు బారికేడ్లను ఒక్కసారిగా ఎత్తివేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది.
Next Story