ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు

by  |
AP CS
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ పదవీకాలం పొడిగింపుకు కేంద్రం అంగీకరించింది. మరో ఆరు నెలల కాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో సీఎస్‌ పదవీకాలం ముగియనుంది.

2022 మే 31 వరకు సీఎస్‌గా సమీర్‌ శర్మ కొనసాగనున్నారు. ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ యూనియన్‌ సెక్రెటరీ సంబంధిత ఉత్తర్వులను జారీచేశారు. రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ ని మార్చ కూడదనే సీఎం నిర్ణయం మేరకు సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా దానికి కేంద్ర ఆమోదం లభించింది.

AP



Next Story