ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది : సుచరిత

by  |
ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది : సుచరిత
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు హర్షం వ్యక్తం చేస్తూ… గుంటూరులో వైసీపీ శ్రేణులు మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హొంమంత్రి సుచరిత పాల్గొని మాట్లాడుతూ… కార్పొరేషన్ల ఏర్పాటు చేయడంపై రాష్ట్రంలోని బీసీలు అందరూ హర్హం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీసీల్లో 139 ఉప కులాలకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వెల్లడించారు. బీసీల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. రూ.30వేల కోట్లను బీసీలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని ఆమె అన్నారు.

Next Story