బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు.. మంటల్లో కార్మికులు..?

by Shamantha N |   (  Updated:2021-06-17 03:15:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం  పాల్ఘడ్ జిల్లాలోని వాంఘోస్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో  పేలుళ్లు సంభవించాయి. విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగండంతో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే పేలుడు సంభవించే సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో రసాయనాలు పేలడం వలనే మంటలు వ్యాపించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భారీ [&hellip;]</p>

maharastra fire accident
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం పాల్ఘడ్ జిల్లాలోని వాంఘోస్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. విశాల్ ఫైర్ వర్క్స్ పేరిట నిర్వహిస్తున్న కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగండంతో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే పేలుడు సంభవించే సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో రసాయనాలు పేలడం వలనే మంటలు వ్యాపించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భారీ పేలుడు శబ్దాలు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story