షాకింగ్ న్యూస్.. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం

by  |
huzurabad
X

దిశ, కరీంనగర్ సిటీ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించకూడదని, నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిథ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ప్రచురించరాదని, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేయరాదని, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని, ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన వెల్లడించారు. ఈసీ ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా.. ప్రచురించినా.. ప్రసారం చేసినా.. శిక్షార్హులని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.



Next Story