- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నెక్కొండ: నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామ శివారు లావుడ్యా తండా, పత్తిపాక తండాతో పాటు నెక్కొండ తండాలోని గుడుంబా స్థావరాలపై నర్సంపేట ఎక్సైజ్ శాఖ ఎస్సై వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా సీతమ్మ, లావుడ్యా మాన్య, న్యాల పద్మలపై కేసు నమోదు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు. అలాగే నెక్కొండ తండాలో పంట పొలాల్లో గుడుంబా తయారీ కోసం నాన పెట్టిన 300 లీటర్ల బెల్లం పటిక పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సర్వర్, సిబ్బంది జలపతి ప్రణవ్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
Next Story