పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపుతో సానుకూలంగా ద్రవ్యోల్బణం!

by  |
పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపుతో సానుకూలంగా ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రవ్యోల్బణం గణనీయంగా సానుకూల స్థితిలో ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి నియంత్రణలో ఉందని, అయితే ప్రధాన ద్రవ్యోల్బణం ఎక్కువగానే కొనసాగుతోందని బుధవారం జరిగిన బిజినెస్ స్టాండర్డ్ బీఎఫ్ఎస్ఐ కార్యక్రమంలో తెలిపారు. ఇందులో తృణధాన్యాలు, వంటనూనెలకు సంబంధించిన సరఫరా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది.

ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం మెరుగుదలను సూచిస్తుందని ఆయన వివరించారు. ఇదే సమావేశంలో క్రిప్టోకరెన్సీ గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయని దాస్ అభిప్రాయపడింది. ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా క్రిప్టోకరెన్సీ అంశం ఆందోళన కలిగించేదిగా ఉంటుందని, ప్రభుత్వానికి అవసరమైన సూచనలు అందించాం. ప్రభుత్వం వీటిని పరిశీలిస్తోందని, దీనికి సంబంధించిన సవాళ్లను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని దాస్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed