ఎక్సైజ్ సీఐ…కరోనాతో మృతి

by  |
ఎక్సైజ్ సీఐ…కరోనాతో మృతి
X

దిశ, ఆసిఫాబాద్‌ : కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఎక్సైజ్ చెక్ పోస్టు సీఐ కరోనాతో గురువారం రాత్రి మృతి చెందారు. వివరాల ప్రకారం.. నాసాని ప్రవీణ్ కుమార్ (43) మంచిర్యాల జిల్లా లజెట్టిపేట వాసి. గ్రూప్స్ రాసి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంసంపాదించారు. అయితే నాలుగు రోజుల కిందట ఆయన తల్లి కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్‌కు వైరస్ సోకింది. దీంతో అతను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. ఆయనకి భార్య, కుమారులు ఉన్నారు.



Next Story

Most Viewed