రోడ్డు దాటుతుండగా..గుర్తు తెలియని వాహనం ఢీ

by  |
రోడ్డు దాటుతుండగా..గుర్తు తెలియని వాహనం ఢీ
X

దిశ,ఖమ్మం :
రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీనడంతో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మ వృత్తి రీత్యా హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేసి, ఈ మధ్యే ఉద్యోగ విరమణ కూడా పొందారు. వస్తువులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన ఆమె రోడ్డు దాటుతుండగా ప్రమాదవ శాత్తు గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed