మాట ఇచ్చారు నెరవేర్చండి.. మాజీ సైనికులు

by  |
ex Service Man
X

దిశ, జవహర్ నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి హామీ మేరకు మాజీ సైనికులకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని మాజీ సైనికులు కోరారు. ఈ మేరకు గురువారం జవహర్ నగర్ మాజీ సైనికుల బృందం మేయర్ మేకల కావ్య ను కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మేయర్ కావ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కెప్టెన్ ఎస్ కే మొయినుద్దీన్, కెప్టెన్ జోసెఫ్, ఉపాధ్యక్షుడు అరవింద్ సింగ్, ప్రధాన కార్యదర్శి త్యాగి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed