గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై పట్టింపేది..?

by  |
గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై పట్టింపేది..?
X

దిశ, మెదక్:
సీఎం కేసీఆర్ ఇతర ప్రాజెక్టులపై ఉన్న ధ్యాస గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయటం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని మరీ పూర్తి చేయిస్తానన్న సీఎం మాటామార్చాని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయించడం స్థానిక ఎమ్మెల్యేవల్ల కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 20 వేల కోట్లు ధాన్యం కొనుగోలుకు వెచ్చించామని ప్రణాళిక సంఘం చైర్మన్ గొప్పలు చెబుతున్నాడని, ముందు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Tags: Husnabad, Ex Mp, ponnam prabhakar, Inspect, crop purchase centres

Next Story

Most Viewed