డీఎస్‌తో ఈటల భేటీ.. మధ్యలో వచ్చిన ధర్మపురి.. ఏం జరిగింది..?

by  |
డీఎస్‌తో ఈటల భేటీ.. మధ్యలో వచ్చిన ధర్మపురి.. ఏం జరిగింది..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్​ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఇద్దరూ చర్చించారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. రాజకీయ పరిణామాలపై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల ఈ సందర్భంగా వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. డీఎస్‌తో భేటీ అయిన సమయంలోనే అక్కడకు వచ్చిన డీఎస్​ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల కలిశారు. దాదాపు 20 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇప్పటికే ఈటల… సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed