జల్లేరు బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందజేత

by  |
MLA Thellam Balaraju,
X

దిశ, ఏపీ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. సోమవారం ఉదయం బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం పంచాయతీ తోటపల్లిలో మృతురాలు బుల్లెమ్మ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. రూ.7.60లక్షల నగదును బుల్లెమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. అలాగే బస్సు ప్రమాదంలో గాయపడిన తాటి సుబ్బలక్ష్మీ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. సుబ్బలక్ష్మికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదే గ్రామానికి చెందిన మల్లాది నాగమణి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి ఆసుపత్రి అధికారులతో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.


Next Story

Most Viewed