సాగర్ ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు

by  |
సాగర్ ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు
X

దిశ, హలియా, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. త్రిపురారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 265 లో, గుర్రం పూడ్ మండల కేంద్ర పరిధిలోని వట్టి కోడ్ 13 వ బూతులో ఈవీఎంలు మొరాయించాయి. 7:30 నిమిషాలు దాటినా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో అధికారులు ఈవీఎంలను దిద్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. అలానే నాగార్జున సాగర్ బూత్ నెంబర్ 107 లోనూ ఈవీఎం మొరాయించింది. అప్రమత్తమైన అధికారులు ఈవిఏంలను మార్చే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ బూత్ లో 8:30 దాటినా పోలింగ్ ప్రారంభం కాలేదు. కానీ ఓటర్లు మాత్రం ఉదయం నుంచే బారులు తీరారు. తిరుపతి ఉపఎన్నికలలో కూడా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి.


Next Story

Most Viewed