హుజూరాబాద్‌లో వీవీ ప్యాట్లు తారుమారయ్యాయా..? సీఈవో కీలక ఆదేశం

by  |
wgl-Poling-record21
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం వీవీ ప్యాట్ల తరలింపులో గందరగోళం జరిగిందని, దానికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నేతలు ఆదివారం ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఈవీఎంల విషయంపై వివరణ ఇవ్వాలని కరీంనగర్‌ కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్వోలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సీఈవో రేపు సమావేశం కానున్నారు.


Next Story

Most Viewed