అది ఈరోజు నిజమవుతోంది: కేసీఆర్

by  |
అది ఈరోజు నిజమవుతోంది: కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్: సమిష్టి కృష్టితో నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని మళ్లీ తీసుకురావొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో ఆయన గురువారం మొక్కలు నాటి 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా వల్ల మూడు నెలల ఇబ్బంది పడ్డామన్నారు. తెలంగాణ వ్యక్తిత్వ పటిమ గొప్పదని, వందకు వంద శాతం మనమే అటవీ విస్తీర్ణ శాతం పెంచుకోవాలన్నారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమన్నారు. మనముందు తరాలు బతికే పరిస్థితులు వచ్చేలా చెట్లను పెంచాలన్నారు. ఈ విషయంలో గట్టిగా మొండిపట్టు పట్టి పనిచేయాలన్నారు.


Next Story

Most Viewed