క్రమశిక్షణ తప్పితే కరోనాకు బలే 

by  |
క్రమశిక్షణ తప్పితే కరోనాకు బలే 
X

దిశ, మహబూబ్ నగర్: యావత్తు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి అన్నారు. ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఒకరి వెంట ఒకరు కరోనా‌కు బలికాక తప్పదన్నారు. కరోనాపై పోరులో ప్రజలందరూ ఎవరికివారు సైనికులై పోరాడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగాపెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని.. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించక తప్పడం లేదన్నారు. అదేపనిగా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Tags: carona, mahabubnagar sp, rema rajeshwary, press meet, ts news

Next Story