- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో నిత్య పెండ్లి కూతురు
<p>దిశ, మణుగూరు : తన అందంతో మైమరిపిస్తూ, యువకులకు వరుస పెళ్ళిళ్ళతో గాళం వేసిన నిత్యకళ్యాణి కొప్పుల సుహాసినిని శుక్రవారం మణుగూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మణుగూరు మండలానికి చెందిన దేవరకొండ వినయ్ని పెళ్లి చేసుకొని.. కొంతకాలం కాపురం చేసి లక్ష రూపాయల నగదు, మూడున్నర లక్షల విలువైన బంగారం, వస్తువులు తీసుకొని మోసం చేసిందని ఫిర్యాదు అందినట్టు సీఐ తెలిపారు. వినయ్ చేసిన కంప్లైంట్ ప్రకారం విచారణ చేపట్టి చిత్తూరు […]</p>

X
దిశ, మణుగూరు : తన అందంతో మైమరిపిస్తూ, యువకులకు వరుస పెళ్ళిళ్ళతో గాళం వేసిన నిత్యకళ్యాణి కొప్పుల సుహాసినిని శుక్రవారం మణుగూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మణుగూరు మండలానికి చెందిన దేవరకొండ వినయ్ని పెళ్లి చేసుకొని.. కొంతకాలం కాపురం చేసి లక్ష రూపాయల నగదు, మూడున్నర లక్షల విలువైన బంగారం, వస్తువులు తీసుకొని మోసం చేసిందని ఫిర్యాదు అందినట్టు సీఐ తెలిపారు. వినయ్ చేసిన కంప్లైంట్ ప్రకారం విచారణ చేపట్టి చిత్తూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపినట్టు స్పష్టం చేశారు. వినయ్తో పాటు మరో ముగ్గురిని ఇదే విధంగా పెండ్లి చేసుకొని.. మోసం చేసిన సంగతి తెలిసిందే.
Next Story






